చంద్రబాబు పై రెచ్చిపోయిన ఎంపీ మిథున్ రెడ్డి

by Anukaran |
mp-mithun-reddy
X

దిశ,ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మీడియంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. చిత్తూరులో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్‌ ఏ మీడియంలో చదివాడో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు లోకేష్‌ కొడుకు ఏ మీడియంలో చదువుతున్నాడో కూడా ప్రజలకు వివరించాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఇంగ్లీష్‌ మీడియంలో చదవొచ్చు.. కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియంలో చదవకూడదా అని నిలదీశారు. విద్యకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని..అది ఓర్వలేక చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed