Venkatesh-Rana: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన వెంకటేష్, రానా.. పోస్ట్ వైరల్

by Hamsa |
Venkatesh-Rana: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన వెంకటేష్, రానా.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మంలో పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. అయితే చాలామంది ఆహారం, నీరు అందక ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు వచ్చాయి.

అయితే కొంతమంది ఇప్పటికే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి సహాయక చర్యలు చేపట్టి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఇప్పటికే వరద బాధితులను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ స్టార్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి వారు తమ వంతు సాయం అందించారు.

ఈ క్రమంలో.. తాజాగా, స్టార్ హీరో వెంకటేష్, రానా కలిసి వరద బాధితులకు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతూ పోస్టును షేర్ చేశారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షలు మొత్తం కోటి రూపాయలు ఇస్తున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘‘విధ్వంసకర వరదల వల్ల నష్టపోయిన వారందరికీ చాలా బాధపడ్డాము. మేము రూ. 1 కోటి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ పునరావాస, ప్రయత్నాల కోసం, చాలా అవసరమైన వారికి చేకూర్చాలని ఆశిస్తున్నాము అని తెలిపారు.

Advertisement

Next Story