- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
హ్యాపీ బర్త్డే ఆడ పులి.. ఈ బ్యూటీ గురించి ఈ సీక్రెట్స్ తెలుసుకోండి మరి!
దిశ, సినిమా : ఆవకాయ బిర్యానీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తెలుగు బ్యూటీ బిందు మాధవి. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. బిందు 1986 జూన్ 14న ఏపీలోని మదనపల్లెలో జన్మించింది. నేడు ఈ బ్యూటీ 38వ వసంతంలోకి అడుగు పెట్టింది. దీంతో సోషల్ మీడియాలో బిందుకు తన అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బిందుకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అవి ఏంటో తెలుసుకోండి.
ఆవకాయ బిర్యాని సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన బిందు తర్వాత, పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన బంపర్ ఆఫర్ సినిమాలో నటించి మెప్పించింది. తర్వాత రామ, రామ.. కృష్ణ, కృష్ణ , పిల్లజమీందార్ లాంటి సినిమాల్లో కూడా నటించి ఆమె ప్రతిభను చాటుకుంది. కానీ ఈ అమ్మడుకు టాలీవుడ్లో అంతగా గుర్తింపు అయితే రాలేదు, దీంతో ఈ ముద్దుగుమ్మ తమిళ ఇండస్ట్రీ వైపు కన్నేసి, అక్కడ మంచి ఆఫర్స్ అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్కి దూసుకెళ్లింది. ఇక చాలా రోజుల తర్వాత ఈ నటి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్లోకి అడుగు పెట్టి ఆడపులిగా తన సత్తా చాటింది. బిగ్ బాస్ మొదటి మహిళా విన్నర్గా నిలిచింది. అయితే బిగ్ బాస్తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ నటి త్వరలో తెలుగులో ఓ భారీ ప్రాజెక్ట్తో అభిమానుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం బిందు పలు వెబ్ సిరీస్లో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ అమ్మడు తాను కాలేజీ చదువుకునే రోజుల్లోనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నదంట. దీంతో మొడల్గా కెరీర్ ప్రారంభించి, పలు యాడ్స్లో నటించింది. కానీ ఆమె నటిగా పరిచయం కావడం తన తండ్రికి, తల్లికి అస్సలు ఇష్టం లేదంట. ఆమెతో 8 నెలలు మాట్లాడలేదంట. కానీ తర్వాత వారు ఆమెను అర్థం చేసుకొని మాట్లాడటం మొదలు పెట్టారని బిందు ఓ ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం..