ఈ రోజు చాలా ప్రత్యేకం మరపురాని ప్రయాణం ఇదే.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ వైరల్

by Disha Web Desk 6 |
ఈ రోజు చాలా ప్రత్యేకం మరపురాని ప్రయాణం ఇదే.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప-2 ఆగస్ట్ 15 గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఇటీవల అల్లు అర్జున్ ఓ అరుదైన ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

తాజాగా, దుబాయ్‌లో మైనపు విగ్రహం పెట్టడంపై ఐకాన్ స్టార్ స్పందిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘‘ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. నా 1వ చిత్రం గంగోత్రి. 2003లో ఈ రోజున విడుదలైంది. ఈ రోజు నేను నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ ప్రారంభిస్తున్నాను. 21 ఏళ్లుగా నా కెరీర్‌లో ఇది మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞుడను. నా అభిమానులకు (ఆర్మీ) వారి అపారమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. రాబోయే సంవత్సరాల్లో మీ అందరిని మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నాను. ఎవర్ గ్రేట్ ఫుల్..’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ అవుతుండటంతో అది చూసిన కొందరు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం తమ హీరోకి దక్కిన ఘనతకు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Next Story