- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చివరిలో షాకింగ్ ట్విస్ట్.. ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే ఓటు వేసిన తారకరత్న భార్య అలేఖ్య!
దిశ,సినిమా : నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఏపీ ఎన్నికల్లో తమ మద్దతు ఏ పార్టీకో చెప్పేశారు. అయితే ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటికి అలేఖ్య పిల్లతో వెళ్లి వారితో కాసేపు సరదాగా గడిపిన విషయం తెలసిందే. దీంతో అందరూ అలేఖ్య మద్దతు వైసీపీకే ఉంటుంది అనుకున్నారు. అంతేకాకుండా తారకరత్న మరణానంతరం అలేఖ్య రెడ్డి ఆయనకు బదులుగా పోటీ చేస్తుదని, ఆమె ఏ పార్టీలోకి వెళ్తుందో చూడాలి అంటూ నెట్టింట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. అంతే కాకుండా విజయ్ సాయి రెడ్డి తన నాన్న లాంటి వాడు అని అలేఖ్య చాలా సార్లు చెప్పింది. దీంతో ఆమె వైసీపీకే పట్టం కట్టనుంది. ఆ పార్టీకే మద్దతు ఇస్తుందని చాలా మంది అనుకున్నారు.
కానీ అందరికీ షాకిస్తూ.. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో షాకింగ్ పోస్ట్ చేసింది. రాబోయే ఎన్నికల్లో తన సపోర్ట్ ఆ పార్టీకేనంటూ చెప్పుకొచ్చింది. తన మద్దతు బాలయ్య మామయ్యేకే అంటూ టీడీపీకే ఓటు వేసింది. ఈ మేరకు ఆమే ఇన్స్టాలో బాలకృష్ణ ఆయన తనయుడు మోక్షజ్ఞతో ఉన్న ఫోటోను ఆమె షేర్ చేసి..నేను ఏ వైపు ఉన్నానని ఎప్పుడూ నాకు ప్రశ్నలు ఎదురు అవుతూనే ఉన్నాయి. కానీ దానికి ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నాను.నా అంగీకారం, ప్రేమ నా కుటుంబం వైపే ఉంటాయి, బాలయ్య మామయ్య.. మిమ్మిల్ని ఓబు, నేను,పిల్లలు ఎంతో ప్రేమిస్తున్నాము అంటూ అలేఖ్య తన పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నిర్ణయం రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. దీంతో తారకరత్న భార్య అలేఖ్య వైసీపీకి సపోర్ట్ అనుకున్నాం కానీ చివరిలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది అంటున్నారు కొందరు. మరికొందరు తారకరత్న భార్యలా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుందని ఆమెను ప్రశంసిస్తున్నారు.