- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
నయనతారతో సినిమా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
![నయనతారతో సినిమా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్! నయనతారతో సినిమా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!](https://www.dishadaily.com/h-upload/2024/06/30/347557-nayan.webp)
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆనంద్ మూవీతో డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, లవ్ స్టోరీ, ఫిదా, అనామిక వంటి చిత్రాలు తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో లవ్ స్టోరీ, ఫిదా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత ‘కుబేర’ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో నాగార్జున, ధనుష్ హీరోలుగా నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్గా చేస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ కమ్ముల, నయనతారతో అనామిక సినిమా చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలనుకున్నాను. కానీ నా దగ్గర కథ లేకపోవడంతో అనామిక మూవీకి రీమేక్ చేశాను. నిర్భయ ఘటనతో తొందరపడి నిర్ణయం తీసుకున్నా. నేను ఈ సినిమా చేయడం తప్పే. ముఖ్యంగా నయనతార లాంటి స్టార్ హీరోయిన్తో అనామిక సినిమా చేసి ఉండకూడదనిపించింది. అలాగే నేను తీసిన కొన్ని సినిమాలు వర్కౌట్ కాలేదు. కానీ నేను డబ్బు కోసం సినిమాలు చేయను. నేను రాసుకున్న కథలు అందరికీ తెలియాలని చేస్తాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శేఖర్ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.