ప్రతిదాన్ని నాశనం చేస్తున్నారు.. నెటిజన్లపై రేణు దేశాయ్ సీరియస్

by sudharani |
ప్రతిదాన్ని నాశనం చేస్తున్నారు.. నెటిజన్లపై రేణు దేశాయ్ సీరియస్
X

దిశ, సినిమా: రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంటుంది. తన సొంతవిషయాలతో పాటు సమాజంలో జరిగే చెడు అంశాలకు సంబంధించి కూడా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మూగ జీవాలను కాపాడటానికి హెల్ప్ చెయ్యండి అంటూ ఓ పోస్ట్ పెట్టింది. కానీ ఎక్కువ మంది హెల్ప్ చెయ్యడానికి ముందుకు రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రేణు దేశాయ్ మరో పోస్ట్ పెట్టింది.

‘మనమందరం ఈ భూమిపై మన తోటి జీవులను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో నేర్చుకోవాలి. మానవులు మరింత స్వార్థపరులుగా మారుతున్నారు. అలాగే వారి చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నాశనం చేస్తున్నారు. కేవలం బోలెడంత డబ్బు సంపాదించడం, డిజైనర్ దుస్తుల్లో ఫ్యాన్సీ పార్టీలకు వెళ్లడం ఒక్కటే విజయానికి కొలమానం కాదు. మీరు ప్రకృతితో కనెక్ట్ అవ్వగలిగితే.. మీ చుట్టూ ఉన్న కొన్ని జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం కూడా జీవితంలో మీ విజయాన్ని చూపించే మార్గం’ అంటూ నెటిజన్లపై రేణు సీరియస్ అయ్యింది. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed