ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన ‘పుష్ప’ విలన్ మూవీ

by Prasanna |
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన ‘పుష్ప’ విలన్ మూవీ
X

దిశ,సినిమా: పుష్పతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విలన్ ఫాహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు ప్రాణం పోసాడు. ఆ మూవీలో పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికి తెలిసింది. 'పుష్ప' కంటే ముందు మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఫహద్.. 'పుష్ప'తో పాపులర్ అయ్యాడు

ప్రస్తుతం అతను బ్యాక్ టు బ్యాక్ మలయాళ సినిమాలు చేస్తూ ఇతర భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే, గతేడాది నటించిన ‘ధూమం’ మూవీ ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుంది. 2023 జూన్ 23న విడుదలైన ఈ చిత్రాన్ని ప్రభాస్ సాలార్ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించింది. సామాజిక సందేశం ఉన్నప్పటికీ, ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలో నటించింది.

ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్ యాపిల్ లో ప్రసారమవుతుంది. ఇప్పుడు తెలుగులో కూడా విడుదలవ్వబోతుంది. థియేటర్లో విడుదలైన ఒక సంవత్సరం తర్వాత జూలై 11 నుండి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఆహా అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed