‘పుష్ప-2’ వాయిదా.. కోర్టులో కేసు వేస్తానంటూ మేకర్స్‌కు నెటిజన్ వార్నింగ్

by Hamsa |
‘పుష్ప-2’ వాయిదా.. కోర్టులో కేసు వేస్తానంటూ మేకర్స్‌కు నెటిజన్ వార్నింగ్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2 రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పుష్ప-2 ఆగస్టు 15న విడుదల చేస్తామని మేకర్స్ నాలుగు నెలల ముందుగానే ప్రకటించడంతో అందరూ ఆగస్టు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. పుష్ప-2 మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటనను వదిలారు. ఆగస్టు 15న కాకుండా పుష్ప-2 డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అలాగే కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు పెడుతున్నారు.

తాజాగా, ఓ నెటిజన్ ఏకంగా మేకర్స్‌కే వార్నింగ్ ఇచ్చాడు. అది కూడా అల్లు అర్జున్ పోస్ట్‌కు రిప్లై ఇవ్వడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్‌లో ఏముందంటే.. ‘‘పుష్ప-2 సినిమా జూన్ 2024లో విడుదల కావాల్సిన సినిమాను డిసెంబర్ 6 2024కు ఎందుకు మార్చారు. ఇదంతా పుష్ప-2 మేకర్స్‌కు జోక్‌‌లా ఉందా?. మీరు ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. తక్షణమే పుష్ప-2 సినిమాను విడుదల చేయకపోతే కమ్యూనిటీ తరపున కోర్టులో కేసు వేస్తాను’’ అని రాసుకొచ్చాడు. అలాగే మరో నెటిజన్ ఇది మంచి పద్ధతి కాదు.. ఇంకా ఎన్ని సార్లు వాయిదా వేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మేకర్స్ అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed