రాజ‌కీయ లాభం కోసం మీరు చేసింది మర్చిపోయారా? జ‌ర్నలిస్ట్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

by sudharani |
రాజ‌కీయ లాభం కోసం మీరు చేసింది మర్చిపోయారా? జ‌ర్నలిస్ట్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. నాగచైతన్య, సామ్‌ విడాకులపై ఆమె మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తీరుపై మండిపడుతూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇష్యూపై జ‌ర్నలిస్ట్ ఆర్‌టీవి రవిప్రకాశ్ రియాక్ట్ అయ్యాడు. ‘నేను సిగ్గుపడుతున్నాను... తెలుగు సంస్కృతిలో స్త్రీలను గౌరవించడమే ప్రధానం... కానీ నేటి రాజకీయాలను చూస్తుంటే మనం చేయగలిగిందల్లా అవమానంగా భావించడమే. స్త్రీ అయిన తర్వాత ఒక స్త్రీని అవమానించడం, ఆపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, మనం ఎంతవరకు రాజకీయ అధోగతిలో మునిగిపోతున్నామో చూపిస్తుంది’ అంటూ పోస్ట్ ట్వీట్ చేశారు.

అయితే.. ఈ ట్వీట్‌పై స్పందించిన పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘మీ ప్రోగ్రామ్స్ వ‌ల‌న నా జీవితం ఏం అయ్యింది? మీకేం తెలుసు అని ఒక ద‌ళిత బిడ్డను బ‌లి ప‌శువుని చేశారు. మీ రాజ‌కీయ లాభం కోసం చేసింది మ‌ర్చిపోయారా’ అంటూ పూనమ్ రాసుకొచ్చింది. ప్రజెంట్ ఈ ట్వీట్ సంచలనంగా మారాయి.








Next Story