నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.. భర్తను పరిచయం చేస్తూ షాకిచ్చిన నివేదా థామస్!

by Jakkula Samataha |
నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.. భర్తను పరిచయం చేస్తూ షాకిచ్చిన నివేదా థామస్!
X

దిశ, సినిమా : నివేదా థామస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జెంటిల్ మన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా, నిన్ను కోరి, జై లవ కుశ సినిమాలో నటించి ఈ బ్యూటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా హిట్స్ తన సొంతం చేసుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. అంతే కాకుండా టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఆఫర్స్ కూడా తగ్గాయి. దీంతో ప్రస్తుతం ఈ నటి చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.

అయితే తాజాగా నివేదా తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. నివేదాకు పెళ్లై పిల్లలు కూడా ఉండటం ఏంటి అని ఆలోచిస్తున్నారా..? ఇది రియల్ లైఫ్‌లో కాదండి, రీల్ లైఫ్‌లో..నివేదా థామస్ నటించిన లేటేస్ట్ మూవీ 35 చిన్న కథ కాదు. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజైంది. ఇందులో ఈ నటి పెళ్లై ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో నటిస్తుంది.

అయితే టీజర్ రిలీజ్ ఫంక్షన్‌లో ఈ బ్యూటి మాట్లాడుతూ.. మా అమ్మ నా పెళ్లి వార్తలు చూసి తెగ షాక్ అవుతూ ఉంటుంది. మాకు తెలియకుండా నీకు పెళ్లి ఎప్పుడు అయ్యిందని ఆశ్చర్య పోతుంటుంది. అవును నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇతనే నా భర్త , వీళ్లు నా పిల్లలు అంటూ వేదిక మీద ఉన్నవారిని చూపిస్తుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ నిజంగా నివేదాకు పెళ్లి కాలేదు. 34 చిత్రంలో ఈ బ్యూటీ ఇద్దరు పిల్లల తల్లిగా, ఓ గృహిణి పాత్రలో నటించబోతున్నట్టు ఆ విధంగా తెలిపింది. ఈ మూవీ ఆగస్టులో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Next Story