దేవుడి దయవల్ల అదే జరుగుతుందని భావిస్తున్నా.. పెళ్లిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
దేవుడి దయవల్ల అదే జరుగుతుందని భావిస్తున్నా.. పెళ్లిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది హీరోయిన్ కంగనా రనౌత్. ప్రజెంట్ ఈమె రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ‘ఎమర్జెన్సీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపించనుంది. అయితే.. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అయినా.. ఏ మాత్రం వెనకడుగు వెయ్యని కంగన ‘ఎమర్జెన్సీ’ సినిమాను రిలీజ్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆ సినిమా కోసం వరుస పోస్టులు పెడుతూనే.. పలు ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘ఎంపీ పదవిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల అదే జరుగుతుందని భావిస్తున్నాను. ఈ పదవీకాలం ముగిసిన తర్వాత పెళ్లి చేసుకుని ఏం లాభం’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన కంగన.. ఎంపీగా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Read More..

దయచేసి రూ.5 అయినా ఎక్స్‌ట్రా ఇవ్వండి కానీ.. బేరం చేయకండి.. రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్

Advertisement

Next Story

Most Viewed