జానీ మాస్టర్ హీరోగా సినిమా లాంచ్..

by Seetharam |
జానీ మాస్టర్ హీరోగా సినిమా లాంచ్..
X

దిశ, సినిమా : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'యథా రాజా తథా ప్రజా' సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీనివాస్ విట్టల దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మరో హీరోగా వికాస్, హీరోయిన్‌గా శ్రష్టి వర్మ నటిస్తోంది. ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ముహూర్తపు సన్నివేశానికి హీరో శర్వానంద్ క్లాప్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. దర్శకులు కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్.. మెగాస్టార్ చిరు పుట్టినరోజున సినిమా ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రూపొందుతున్న చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed