అనంత్ అంబానీ- రాధిక వినాయకుడికి అందించిన బహుమతేంటో తెలుసా? ఏకంగా 15 కోట్లతో

by Anjali |   ( Updated:2024-09-12 15:09:34.0  )
అనంత్ అంబానీ- రాధిక వినాయకుడికి అందించిన బహుమతేంటో తెలుసా? ఏకంగా 15 కోట్లతో
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రపంచ కుబేరుడైన అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చరిత్రలో నిలిచిపోయేలా అనంత్ అంబానీ వివాహం కోట్లలో ఖర్చు పెట్టి జరిపించారు. వీరి పెళ్లికి ప్రముఖ సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరై తెగ సందడి చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు హాజరై.. అట్రాక్షన్‌గా నిలిచారు. లక్షలు, కోట్లు విలువ చేసే బహుమతులు కూడా సమర్పించారు. రాధికా, అంబానీ పెళ్లై దాదాపు 2 నెలలు అవుతుంది. వీరి పెళ్లయ్యాక వినాచక చవితి పండుగ రావడం విశేషం. అంబానీ కుటుంబానికి దైవభక్తి ఎక్కువన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబయిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా అనంత్ అంబానీ-రాధిక దంపతులు ముంబయిలోని లాల్ బాగ్ మహారాజా గణనాథుడిని చందా ఎంత ఇచ్చారంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేక కానుకను గణనాథుడికి సమర్పించారు. ధన రూపంలో కాకుండా ఖరీదైన బహుమతుల రూపంలో కానుకలు సమర్పించి విఘ్ననాయకుడిపై భక్తిని చాటుకున్నారు. అందేంటంటే? ఏకంగా 20 కిలోల బంగారు కిరీటాన్ని వినాయకుడి అలంకరణ కోసం అందించారట. దీని ధర 15 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed