ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ‘ఇండియన్ 2’ పై నటుడు కామెంట్స్ వైరల్

by sudharani |
ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ‘ఇండియన్ 2’ పై నటుడు కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: విలక్షణ నటుడు కమల్ హాసన్, టాలెంటెడ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సేనాపతి ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. జూలై 12 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్.

ఈ సందర్భంగా ఎస్‌జే సూర్య సినిమాలో తన క్యారెక్టర్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ వస్తుంది. ఇందులో నా నటన చూసి.. నన్ను ‘ఇండియన్ 2’ లో తీసుకున్నాడు డైరెక్టర్. ఇండియన్ 2లో నేను కనిపించేది కొద్ది సేపే అయినప్పటికీ ఆ సీన్స్, సన్నివేశాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషించే అవకాశమిచ్చాడు. ఇది నా సినీ కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని పాత్రల్లో ఒకటి’ అంటూ చెప్పొకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed