నాన్నను ఒక్కసారి కూడా చూడలేదు : కరీనా భావోద్వేగ వ్యాఖ్యలు

by Shyam |
నాన్నను ఒక్కసారి కూడా చూడలేదు : కరీనా భావోద్వేగ వ్యాఖ్యలు
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌తో పాటు సోదరి కరిష్మా కపూర్‌ను తల్లి బబితా కపూర్ ఎవరిపై ఆధారపడకుండా సింగిల్‌గానే పెంచింది. ఈ విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన కరీనా.. తను, కరిష్మా పెద్దయ్యే వరకు తండ్రి రణ్‌దీర్ కపూర్‌ను ఒక్కసారి కూడా చూడలేదని, కపూర్ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సాయం పొందలేదని తెలిపింది. కాగా రణ్‌దీర్, బబిత 1971లోనే పెళ్లి చేసుకోగా 1988 నుంచి విడిగా ఉంటున్నారు.

ఈ మేరకు అక్క కరిష్మా స్టార్ అయ్యేవరకు తాము అనుభవించిన ఆర్థిక కష్టాల గురించి కరీనా వివరించింది. ‘అమ్మ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. తను సింగిల్ మదర్‌గానే ఉంటూ మమ్మల్ని కష్టపడి పెంచింది. రియల్ ఎస్టేట్‌తో పాటు ఏవో చిన్న చిన్న బిజినెస్‌లు చేస్తుండేది. అయితే మా లైఫ్‌లో నాన్నది కూడా ఇంపార్టెంట్ రోల్’ అని చెప్పుకొచ్చింది. తండ్రిని చిన్నప్పుడు తరచూ కలవలేకపోయినా, ఇప్పుడు మాత్రం అందరం ఓ కుటుంబంగా కలిసిపోయామని చెప్పింది. కాగా రణ్‌దీర్, బబిత దశాబ్దాలుగా విడిగా ఉంటున్నా, విడాకులు తీసుకోకపోవడం గమనార్హం. అంతేకాదు ఫ్యామిలీకి దగ్గరగా ఉండేందుకు ముంబయి, చెంబూరు ప్రాంతంలోని పూర్వీకుల ఇంటిని అమ్మేస్తున్నట్టు రణ్‌దీర్ ఇటీవలే ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed