నాలా పరివాహక ప్రజలు అప్రమత్తం..!

by  |
నాలా పరివాహక ప్రజలు అప్రమత్తం..!
X

దిశ, ముషీరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నాలా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలోని నాల పరివాహక ప్రాంతాలైన అడిక్మెట్ డివిజన్ నాగమయ్య కుంట, గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్, సబర్మతి నగర్‎లలో శనివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాలకు నగరంలో లోతట్టు ప్రాంతవాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ పర్యటనలో టీఆర్ఎస్ నాయకులు ముఠా నరేష్, ప్రభాకర్, జై సింహ, ముకుంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed