ఇది చరిత్రలో మొదటిసారి: తలసాని

by  |
ఇది చరిత్రలో మొదటిసారి: తలసాని
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా నిరాడంబరంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేపు బోనాల జాతర జరగనున్నది. ఈ క్రమంలో మంత్రి తలసాని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, అర్చకుల సమక్షంలో మహంకాళి ఆలయంలోనే బోనాల జాతర నిర్వహిస్తామని, ఆలయ చరిత్రలో మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. భక్తులు తమ తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed