- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
మంత్రి గన్మెన్కు కరోనా పాజిటివ్!
దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు.ఇన్ని రోజులు వైద్యులు, మెడికల్ విద్యార్థులు, పోలీసులను వణికించిన ఈ మహమ్మారి తాజాగా ఓ మంత్రి వ్యక్తిగత సిబ్బందిని తాకింది. తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గన్మెన్కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ ఘటనతో వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల అధికార యంత్రాంగం షాక్కు గురయ్యింది. మూడు రోజుల కిందట అస్వస్థతకు గురైన గన్మెన్కు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే అతన్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, గత కొన్ని రోజులుగా మంత్రి పలు అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో ఇతను పాల్గొన్నట్టు సమాచారం.
10 రోజులుకుగా విధుల్లో లేడు..
మంత్రి నిరంజన్ రెడ్డి భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిన మాట వాస్తవమే. కానీ, అతను మహబూబ్ నగర్ నుంచి విధులకు హాజరయ్యేవాడని వనపర్తి జిల్లా మీడియా సెల్ కన్వీనర్ యోగానంద రెడ్డి చెప్పారు. అంతేకాకుండా ఆ వ్యక్తి గత 10రోజుల నుంచి మంత్రి వద్ద విధులు నిర్వహించడం లేదని వివరించారు. కావున, బాధితుడు మంత్రిని లేదా అతని వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కలవలేదని ఆయన స్పష్టం చేశారు.