బురద రాజకీయం చేస్తున్నారు : కన్నబాబు

by srinivas |
బురద రాజకీయం చేస్తున్నారు : కన్నబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ వరద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed