అమరావతే రాజధాని.. అదనంగా మరో రెండు

by  |
minister anil kumar fire on chandrababu
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు చర్యలు రాజధాని రైతులను రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని మార్చడం లేదని స్పష్టం చేశారు. అదనంగా మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని.. అంతమాత్రాన అమరావతికి ప్రాధాన్యత తగ్గదన్నారు.

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సీఎం నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు సమర్థిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందిన కాదని చంద్రబాబు భావిస్తే తన 24 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు మంత్రి అనిల్ కుమార్ .


Next Story

Most Viewed