ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

by Sumithra |   ( Updated:2020-11-01 04:16:15.0  )
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
X

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగారంలో నివాసముండే సాల్మన్ రాజు అనే వ్యక్తి గత సంవత్సర కాలంగా ఆర్యనగర్ లోని అపార్ట్ మెంట్ లో ప్లంబర్ వర్క్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే అపార్ట్మెంట్ పక్కన నివాసముండే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి తన పని ముగించుకుని వచ్చిన వివాహిత భర్త ఉమాకాంత్ వీళ్లిద్దరూ కలిసి ఉండడం చూసి కోపంతో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న రాడ్ తో సల్మాన్ రాజ్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం నిందితుడు ఉమాకాంత్ పరారీలో ఉన్నాడని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed