మద్దిరాల మండలంలో మర్డర్

by  |
మద్దిరాల మండలంలో మర్డర్
X

దిశ తుంగతుర్తి: భూ తగాదాలతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో చిన్ననేమిల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గత నెల 20వ తేదీన యాట లింగయ్య, యాట శ్రీను తమ వ్యవసాయ క్షేత్రాలు వద్ద సరిహద్దు విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో యాట శీను.. యాట లింగయ్య పై రాయితో విచక్షణారహితంగా బాదడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అతడి పరిస్థితి క్రమంగా విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ లింగయ్య శనివారం రాత్రి మరణించాడని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed