విషాదం: విద్యుత్ షాక్‎తో వ్యక్తి మృతి

by  |
విషాదం: విద్యుత్ షాక్‎తో వ్యక్తి మృతి
X

దిశ, సిద్దిపేట: విద్యుత్ షాక్‎తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన గాజుల నాగరాజు.. వ్యవసాయ పొలం వద్ద స్టార్టర్ రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‎కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నాగరాజు మృతిపై ఆయన తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed