దారుణం: భార్యపై కోపం.. అలా చేసి రోడ్డుపై ఈడ్చుకెళ్ళిన భర్త

by Sumithra |
దారుణం: భార్యపై కోపం.. అలా చేసి రోడ్డుపై ఈడ్చుకెళ్ళిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఒక్క కుటుంబంలో కలతలు ఉండడం సహజం. భార్యాభర్తల మధ్య గొడవలు ఉండడం సాధారణం. కానీ, చిన్న చిన్న గొడవలకే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒకరినొకరు చంపుకోవడమో, కుటుంబ కలహాలను తాళలేక ఆత్మహత్యకు పాల్పడడమో చేస్తున్నారు. తాజాగా కుటుంబ కలహాల మధ్య భార్యను అతికిరాతకంగా గొడ్డలితో నరికి రోడ్డుపై భార్య శవాన్ని ఈడ్చుకెళ్లాడు ఓ కిరాతక భర్త. ఈ భయంకర ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

రాజస్థాన్ రాష్ట్రం రామ్‌పూర పరిధిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే పింటూ(40) అనే వ్యక్తికి పదిహేను సంవత్సరాల క్రితం సీమ(35)తో వివాహమైంది. వీరికి అవినాష్ అనే కుమారుడు ఉన్నాడు. కలతలు లేకుండా సాగుతున్న వీరి కాపురంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. వీటి వలనే భార్యాభర్తలు ఇద్దరు తరుచూ గొడవపడుతుండేవారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మరోసారి భార్యాభర్తలు ఇద్దరు గొడవపడ్డారు. దీంతో భార్య సీమ తన అన్న ఇంటికి వెళ్ళిపోయింది.

రెండు రోజుల తర్వాత భార్యను ఇంటికి తీసుకొచ్చిన పింటూ మరోసారి తనతో గొడవపడ్డాడు. ఈసారి గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కోపేద్రేకుడైన పింటూ ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యను నరికి చంపాడు. అంతేకాకుండా భార్య శవాన్ని నడి వీధిలో 80 మీటర్లు లాక్కెళ్లాడు. ఈ ఘటన చూస్తున్న చుట్టుపక్కలవారు భయంతో గజగజ వణికిపోయారు. అనంతరం అక్కడినుంచి పరారైన పింటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story