Barley Water : బార్లీ వాటర్‌తో కీళ్లు, మోకాళ్ల నొప్పులకు చెక్ !

by Prasanna |
Barley Water : బార్లీ వాటర్‌తో కీళ్లు, మోకాళ్ల నొప్పులకు చెక్ !
X

దిశ, ఫీచర్స్ : బార్లీ గింజలను నీటిలో మిక్స్ చేసి ఉదయాన్నే పరిగడుపు తాగడంవల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. షుగర్, బీపీలను కంట్రోల్ ఉంచుతాయని, కిడ్నీల్లో రాళ్ల సమస్యను నివారిస్తాయని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గుప్పెడు బార్లీ గింజలను ఒక లీటర్ నీటిలో కలిపి 15 నిమిషాలపాటు ఆ నీటిని వేడిచేయాలి. దీనివల్ల బార్లీ గింజల్లోని పోషకాలు నీటిలోకి చేరుతాయి. తర్వాత ఆ నీటిని తాగడంవల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పరిగడుపున బార్లీ నీటిని తాగితే పెద్దపేగు శుభ్రం అవుతుంది. ఇది కోల‌న్ క్యాన్సర్ సమస్యను, శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. క‌డుపులో మంట‌గా అనిపించడాన్ని, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి. యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు కలిగి ఉండటం మూలంగా బార్లీ నీటిని తాగడంవల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. డయాబెటిస్ రోగులు బార్లీ నీటిని తాగడంవల్ల దాని ప్రభావం తగ్గుతుంది. ఫైబర్ కలిగి ఉన్నందున జీర్ణశక్తికి దోహదపడుతుంది. అధిక బరువు సమస్యను నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. గర్భిణులు బార్లీ వాటర్ తాగడంవల్ల మూత్రాశయ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్లను కరిగించే గుణం కూడా బార్లీ గింజలకు ఉంటుంది.

జొన్న అంబలిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే !

Next Story