ఒక్కరోజే ముగ్గురిపై చిరుత దాడి..

by  |
ఒక్కరోజే ముగ్గురిపై చిరుత దాడి..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుమల ఘాట్ రోడ్డులో దారుణం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ మహిళపై మంగళవారం చిరుతపులి దాడి చేసింది. వెంటనే అప్రమత్తమన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది.

కాగా, కేవలం ఇవాళ ఒక్కరోజే ఆ చిరుత ముగ్గురిపై దాడి చేసిందని స్థానికుల సమాచారం. దీంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుతను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఆహారం కోసమే చిరుత అటవీలో నుంచి జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని అటవీ శాఖ భావిస్తోంది.


Next Story

Most Viewed