కరోనా టెస్టుల్లో వేగం పెంచాలి: కిషన్‌రెడ్డి

by  |
కరోనా టెస్టుల్లో వేగం పెంచాలి: కిషన్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు వెళ్తూ కరోనా టెస్టుల్లో వేగం పెంచాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్, కంటైన్‌మెంట్ జోన్ల విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి 2.40లక్షల కిట్లను పంపించిందని, అవరసరమైన ఔషధాలు, పీపీఈ కిట్లను పంపుతోందన్నారు. మరో 1200 వెంటిలేటర్లు పంపేందుకు కేంద్రం ఏర్పాటు చేస్తుందన్నారు. 2లక్షలకు పైగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లు కేంద్రం నుంచి వచ్చాయని, కరోనా చికిత్స కోసం కేంద్రం రూ.200 కోట్లు ఇచ్చిందని తెలిపారు.


Next Story

Most Viewed