థియేటర్‌లోనే ‘జానకితో నేను’

by  |
థియేటర్‌లోనే ‘జానకితో నేను’
X

దిశ, వెబ్‌డెస్క్ :
మహానటి ఫేమ్ కీర్తి సురేష్‌, సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి ‘ఐనా.. ఇష్టం నువ్వు’ అనే టైటిల్‌ను గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ చిత్ర టైటిల్‌ను ‘జానకితో నేను’గా మార్చినట్లుగా చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతుండగా, ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగబాబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో విలన్‌గా రాహుల్ దేవ్ నటించారు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయని, నాలుగైదు రోజులు ప్యాచ్ వర్క్ చిత్రీకరణ మాత్రమే మిగిలివుందని, త్వరలోనే ఆ ప్యాచ్ వర్క్‌ను కీర్తిసురేష్‌తో చిత్రీకరిస్తామని నిర్మాత అడ్డాల చంటి తెలిపారు.

ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ మొదటి వారానికి తొలికాపీ సిద్ధమవుతుంది. థియేటర్స్ ఓపెన్ కాగానే సరైన డేట్ చూసుకుని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సురేష్ అందించగా, అచ్చు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


Next Story

Most Viewed