జీఎన్ సాయిబాబాకు కరోనా పాజిటివ్

by Shamantha N |
జీఎన్ సాయిబాబాకు కరోనా పాజిటివ్
X

ముంబయి: మావోయిస్టులతో సంబంధాల కేసులో మహారాష్ట్రలోని నాగపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ అనూప్ కుమ్రే ధ్రువీకరించారు. సాయిబాబాకు జలుబు, దగ్గు, జ్వరం రాగానే గురువారం కరోనా టెస్టు చేయించామని, ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు శుక్రవారం రిపోర్టు వచ్చిందని తెలిపారు. చెక్అప్ కోసం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్(జీఎంసీహెచ్)కు పంపించామని చెప్పారు. తిరిగి వచ్చాక సాయిబాబాకు ఇతర ఖైదీల్లాగే ఇక్కడే జైలులో చికిత్స అందిస్తామని తెలిపారు. ఐసొలేషన్‌పై ఆరా తీయగా, సాయిబాబా ఇప్పటికే ప్రత్యేకమైన అండా సెల్‌లో ఉన్నారు. అక్కడే జైలు వైద్యులతో చికిత్సనందిస్తామని వివరించారు. అండర్‌వరల్డ్ డాన్ అరుణ్ గౌలీకి రెండు రోజుల క్రితం పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం పది మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకిందని, వారికీ జైలులోనే చికిత్సనందిస్తున్నట్టు కుమ్రే తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed