జర్నలిస్టులకు జగన్ సర్కార్ షాక్

by srinivas |
ap cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీని రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జర్నలిస్టుల జీతాలు చాలా తక్కువగా ఉంటాయని, ఇప్పుడు ప్రభుత్వం కూడా తమకు సహయం చేయకుండా చేతులెత్తేస్తే తమ పరిస్థితి ఏంటని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు.

Next Story