లోకేష్ నోరు అదుపులో పెట్టుకో : అనిల్‌కుమార్

by srinivas |
లోకేష్ నోరు అదుపులో పెట్టుకో : అనిల్‌కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: పొలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇంతకుముందు నారా లోకేష్ చేసిన కామెంట్స్‌పై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఘాటుగా స్పందించారు. టీడీపీ వల్లే పోలవరం నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఆ ప్రాజెక్ట్‌ పేరు చెప్పి కమీషన్లు దండుకున్నది చంద్రబాబేనని విమర్శించారు. శుక్రవారం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘నారా లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. సీఎం వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. లోకేష్‌ మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించకు. రైతులను హింసించిన చరిత్ర మీ నాన్నది. టీడీపీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు.

పప్పు మహరాజ్.. జాగ్రత్తగా మాట్లాడు. నోరు వుందని వాగితే.. రోడ్డు మీద నిలబెడతాం. పోలవరం ప్రాజెక్ట్‌ మేము పూర్తి చేస్తామని తెలిసే ముందుగానే నువ్వు మీసాలు తీసేశావు. లాలూచీ పడేది మీరు. మీ నాన్న ఘనకార్యం వల్లే పోలవరానికి ఈ గతి పట్టింది. దమ్ము, ధైర్యంతో పనిచేసేది సీఎం వైఎస్‌ జగన్‌. ఆయన ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రం సుభీక్షంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో సమయానికి వర్షాలు పడుతున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. 2021 నాటికి పోలవరం పూర్తికి చేయడానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం’ అని మంత్రి స్పష్టంచేశారు.

Next Story