భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

by  |

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను భర్త హత్యచేయడంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ధారూర్ మండలం మైలారం కొత్తతండాకు చెందిన కిషన్‌నాయక్, గంగి బాయ్ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో మద్యానికి బానిసైన కిషన్‌ నాయక్‌ తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి పూటుగా మద్యం తాగిన వచ్చిన కిషన్‌నాయక్‌ భార్య గంగిబాయ్‌తో గొడవపడి గొడ్డలితో నరికి చంపాడు. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed