- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Astrology: 55 ఏళ్ల తర్వాత గజకేసరి యోగం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు!

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో యోగాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాఘ పౌర్ణమి రోజున భక్తులు పుణ్యస్నానాలు చేయడం వలన మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. దీని వలన జీవితంలో వస్తున్న సమస్యలన్ని కూడా పోతాయని జ్యోతిష్యులు అంటున్నారు. అయితే, మాఘ పౌర్ణమి తర్వాత గజకేసరి యోగం ఏర్పడనుంది. ఇది 55 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై పడనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కుంభ రాశి ( kumbha rashi )
ఈ యోగం వలన కుంభ రాశి వారికీ మంచి జరగనుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. అలాగే, నిలిచిపోయిన డబ్బు మీ వద్దకు వస్తుంది. జీవితంలో ఇప్పటి వరకు చూడని ధనాన్ని కూడా చూస్తారు. కొత్తగా వ్యాపారాలకు చేసే వారికీ ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. కోర్టుకి సంబంధించిన కేసుల నుంచి బయటపడతారు. అలాగే, సమాజంల గౌరవం పెరుగుతుంది.
కన్య రాశి ( kanya rashi )
ఈ యోగం వలన కన్యా రాశి వారు , మొదలు పెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. మీ పాత స్నేహితులతో కొత్త బిజినెస్ ను ప్లాన్ చేస్తారు. మీ సోదరులతో ఏర్పడిన వివాదాలన్నీ పరిష్కారమౌతాయి. అలాగే, వ్యాపార పనుల్లో మీ జీవిత భాగస్వామి మద్ధతు ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో పని చేసే వారికీ కలిసి వస్తుంది. మీరు పాతకాలంలో కొనుగోలు చేసిన భూములకు రేట్లు పెరుగుతాయి. దీని వలన మీ కుటుంబం సంతోషంగా ఉంటారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.