అయోధ్యకు వెళ్లొచ్చిన.. ఆ సేవకులకు సన్మానం

by  |
అయోధ్యకు వెళ్లొచ్చిన.. ఆ సేవకులకు సన్మానం
X

దిశ, హుస్నాబాద్: అయోధ్యకు వెళ్లొచ్చిన కర సేవకులను భార్గవపురం సేవ సమితి ఆధ్వర్యంలో గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ.. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయోధ్యకు వెళ్లేందుకు విశ్వహిందూ పరిషత్, రామశిలా, రామజ్యోతి, రామజన్మభూమి ట్రస్ట్ పిలుపు మేరకు హుస్నాబాద్ ప్రాంతం పలువురు కర సేవకులు అయోధ్యకు వెళ్ళి వచ్చారు. ఈ సందర్భంగా ఆ కర సేవకులను పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమంది పాఠశాలలో ఘనంగా సన్మానించారు.


Next Story

Most Viewed