కిన్నెరసాని వాగు ఉగ్రరూపం

by  |
కిన్నెరసాని వాగు ఉగ్రరూపం
X

దిశ, కొత్తగూడెం: జిల్లా ఆళ్లపల్లి మండలంలో కిన్నెరసాని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలకు వరద పోటెత్తింది. దీంతో ఆళ్లపల్లి మండలంలోని మైలారం- రాయిగూడెనికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆదివాసులు వరద ఉద్ధృతిలోనే వాగులు దాటుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే భయం గుప్పెట్లో బతుకుతున్నామని, వైద్య సేవలు కూడా అందడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.


Next Story

Most Viewed