మైనారిటీ కమిషన్‌లో కేసుల విచారణ..

by Shyam |   ( Updated:2020-02-15 07:06:53.0  )
మైనారిటీ కమిషన్‌లో కేసుల విచారణ..
X

తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ కమరుద్దీన్ ఈరోజు రెండు కేసులను విచారించారు. గజ్వేల్ మండలం, రిమ్మనగూడ గ్రామం వద్ద వ్యవసాయ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుని పట్టాదారు పేర్ల స్థానంలో తమ పేర్లను నమోదు చేయించుకున్న కేసులో ఇరువర్గాల వాదనలు విని మార్చి1వ తేదీకి వాయిదా వేశారు. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గోపన్‌పల్లి గ్రామం, సర్వే నం. 124/ఇ లోని ప్లాట్లకు సంబంధించిన కేసులోనూ ఇరువర్గాల వాదనను విన్న కమిషన్ సమగ్ర నివేదిక కోసం కేసును మార్చి 1కి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed