- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యూజీసీ నిబంధనల ప్రకారమే పరీక్షలు

దిశ,న్యూస్బ్యూరో: యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పరీక్షలు రద్దు చేయడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ వేసిన పిల్పై గురువారం వాదనలు జరిగాయి. పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని పిటీషనర్ తరపున న్యాయవాది దామోదర్రెడ్డి వాదించారు. యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని, దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని పిటిషనర్ తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం యూజీసీ నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. రెండు, మూడు వారాల తర్వాత పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని ఏజీ హైకోర్టుకు వివరించారు. అనంతరం పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.