టీడీపీకి భారీ షాక్?

by  |
టీడీపీకి భారీ షాక్?
X

దిశ ఏపీబ్యూరో : టీడీపీకి ఊహించని షాక్ తగలబోతుందా? ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత జలక్ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు త్వరలోనే టీడీపీకి గుడ్బై చెప్పనున్నారని సమాచారం.

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చలు కూడా ముగిసిసాయని, గంటా చేరికకు సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంటా సన్నిహితులు కూడా నిర్ధారించారు. ఆగస్ట్ 15న పార్టీ మార్పుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసే సమయంలోనే వైఎస్ఆర్సీపీలో చేరాలని గంటా నిర్ణయించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గంటా చేరిక వెనుక అవంతి శ్రీనివాస్ ఉన్నారని సమాచారం.ఈ నేపథ్యంలోనే ఆయన కొంతకాలంగా గంటా పై దూకుడైన వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపారు.

వ్యూహాత్మకంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఒత్తిడి చేసి పార్టీ మార్పుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. గంటా పార్టీ మార్పు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే..టీడీపీకి భారీ షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.


Next Story

Most Viewed