రైతులు ఆ విషయం అర్థం చేసుకుంటారు: పీయూష్ గోయల్

by Shamantha N |   ( Updated:2020-12-12 09:08:32.0  )
రైతులు ఆ విషయం అర్థం చేసుకుంటారు: పీయూష్ గోయల్
X

దిశ,వెబ్ డెస్క్: రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చట్టాలనేవి దేశ ప్రయోజనాలకు లోబడి ఉన్నాయని రైతులు అర్థం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు సంఘాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందాలని ఆయన అన్నారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే తమతో చర్చించ వచ్చని అన్నారు. వారితో చర్చించేందుకు 24 గంటలు తాము అందుబాటులో ఉంటామని తెలిపారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed