ఆదిలాబాద్‌లో ఆ గ్రామస్తులందరూ విలపిస్తున్రు

by Aamani |   ( Updated:2020-06-23 20:52:25.0  )

దిశ, ఆదిలాబాద్: పిడుగు పడి రైతు మృతి చెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలం నంబాల గ్రామంలో మంగళవారం రాత్రి గొల్లెం పెంటయ్య (55) రైతు తన పొలంలో వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నాడు. ఈ సమయంలో పిడుగు పడింది. దీంతో అతను మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed