శ్రీనగర్ లో భూకంపం..!

by  |
శ్రీనగర్ లో భూకంపం..!
X

దిశ, వెబ్‎డెస్క్: జ‌మ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభ‌వించింది. మంగ‌ళ‌వారం రాత్రి 9.40 గంట‌ల‌కు శ్రీన‌గ‌ర్‌, బుద్గాం, గందేర్బ‌ల్ స‌హా ప‌‌రిస‌ర జిల్లాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్ర‌త 3.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్‌ సిస్మోల‌జీ (ఎన్సీఎస్)ప్ర‌క‌టించింది. భూఅంత‌ర్భాగంలో 5 కిలోమీటర్ల లోపల భూమి కంపించించిద‌ని ఎన్సీఎస్ వెల్లడించింది. దీంతోప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని జమ్మూకశ్మీర్ అధికారులు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed