ఏసీబీకి చిక్కిన డ్రగ్ కంట్రోల్ సిబ్బంది..!

by  |
ఏసీబీకి చిక్కిన డ్రగ్ కంట్రోల్ సిబ్బంది..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. హుజురాబాద్‎కు చెందిన రవిందర్ అనే వ్యక్తి మెడికల్ షాపు లైసెన్స్ విషయంలో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుబడ్డారు. జూనియర్ అసిస్టెంట్ వినాయక్ రెడ్డి రూ. 20 వేలు, అటెండర్ రిజ్వాన్ రూ. 500 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‎గా పట్టుకున్నారు. లైసెన్స్ విషయంలో డబ్బులు డిమాండ్ చేయగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లానింగ్‎తో సోమవారం డబ్బులు తీసుకుంటుండగా వారిని పట్టుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.


Next Story