'ఖిలాడీ' డైరెక్టర్ కి కరోనా.. టెన్షన్ లో రవితేజ ఫ్యాన్స్

by vinod kumar |   ( Updated:2021-04-20 00:07:22.0  )
ఖిలాడీ డైరెక్టర్ కి కరోనా.. టెన్షన్ లో రవితేజ ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా ఉదృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా చాలా మంది కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా కలకలమే సృష్టిస్తుంది. ఇప్పటీకే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఖిలాడీ డైరెక్టర్ రమేష్ వర్మ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. అందరు మాస్క్ ధరించాలి. అత్యవసరాలకు మినహాయించి బయట తిరగడం మానేయాలంటూ ” ట్వీట్ చేశారు. ఇకపోతే రమేష్ వర్మకు కరోనా రావడంతో ‘ఖిలాడీ’ షూట్ కి బ్రేక్ పడింది. మే 28 ‘ఖిలాడీ’ సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా దెబ్బ గట్టిగా తగలడంతో ఈ సినిమా కూడా వాయిదా పడుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Advertisement

Next Story