Tirumala Updates: తిరుమలలో కొనసాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనం

by Shiva |
Tirumala Updates: తిరుమలలో కొనసాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: భక్తుల కొంగు బంగారం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ వైకుంఠ ద్వార దర్శన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. బుధవారం పండుగ రోజు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఓ మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 9 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) ఒక గంట సమయం పడుతోంది. ఇక గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. బుధవారం స్వామి వారిని 71,417 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story

Most Viewed