సరదా తీసిన ప్రాణం.. తండ్రి, కూతురు మృతి

by Sridhar Babu |   ( Updated:2021-06-09 08:32:53.0  )
సరదా తీసిన ప్రాణం.. తండ్రి, కూతురు మృతి
X

దిశ, కరీంనగర్ సిటీ: పారుతున్న నీటి కాల్వలోకి దిగి స్నానం చేస్తానన్న ఆ చిన్నారి సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌజ్ గ్రావిటీ కెనాల్‌లో పడి తండ్రి, కూతురు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్నానం చేసేందుకు కెనాల్లోకి దిగిన రిషిత(07) నీటి ప్రవాహంలో కోట్టుకుపోతుండగా.. కాపాడానికి వెళ్లిన తండ్రి శ్రీనివాస్ కూడా ప్రవాహ వేగానికి బలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇద్దరి మృతదేహలను బయటకు తీసి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతులది రామడుగు మండలం రౌతుపల్లి అనుబంధ గ్రామం గౌండ్లపల్లి అని తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed