గంజాయి అమ్ముతున్న యువకులు అరెస్టు

by Sridhar Babu |
గంజాయి అమ్ముతున్న యువకులు అరెస్టు
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు యువకులను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సంఘటన వివరాలను బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య తెలిపారు. గత కొంత కాలంగా చెడు అలవాట్లకు, జల్సాలకి అలవాటు పడిన యువకులు అదే క్రమంలో గంజాయి తాగడానికి డబ్బు కోసం గంజాయి అమ్మి వచ్చే లాభం తో మళ్లీ గంజాయి కొనుగోలు చేస్తున్నారు. గత సంవత్సరం నుండి మహారాష్టలోని బల్లర్శ, చంద్రపూర్ రైల్వే స్టేషన్ లలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి కొనుక్కువచ్చి బెల్లంపల్లిలో నివాసం ఉండే గంజాయి అవసరం ఉన్న వారికి ఎక్కువ రేటుకు అమ్ముతూ సులువుగా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నారు. బాబు క్యాంపునకు చెందిన

బండి సూర్య తేజ,(18 ) స్టూడెంట్, అతని స్నేహితులైన బెల్లంపల్లి కి చెందిన ఇద్దరు మైనర్ బాలురు కలిసి మహారాష్టలోని బల్లర్శ లో గుర్తుతెలియని వ్యక్తి వద్ద అర కిలో గంజాయి రూ. 7,500 విలువైనది బెల్లంపల్లిలో కొంత విక్రయించారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. మిగిలింది కన్నాలబస్తీలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర అమ్మడం కోసం ముగ్గురు కలిసి ఉన్నారు. ఈ సమాచారం అందిన పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసు వాహనాన్ని చూసి పారిపోతుండగా పట్టుపడ్డారు. వారి నుంచి గంజాయిని, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.



Next Story