- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
దిశ, దుండిగల్: స్కూల్ బస్ ఢీకొని బాలిక మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే కుంట రాజు కుటుంబ సభ్యులతో కలిసి మల్లంపేట గ్రామంలో కిరాణం కొట్టు నడుపుకుంటూ నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు స్థానికంగా ఉండే లీఫ్ స్కూల్లో చదువుతున్నారు. రోజు లాగే ఇద్దరు ఉదయం స్కూల్ కి బయలుదేరారు.స్కూల్ ఆవరణలో బస్సు దిగిన బాలికలు తరగతి గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
మూడు సంవత్సరాల చిన్న కుమార్తె కుంట మన్విత లోపలికి వెళ్లే క్రమంలో స్కూల్ బస్సు పక్క నుంచి ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం యాజమాన్యం వెంటనే బాచుపల్లి లోని మమత ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. పాఠశాల ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డ్రైవర్ నిర్లక్ష్యమే బాలిక మృతికి కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.