పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి..

by Sumithra |   ( Updated:2024-10-16 03:46:23.0  )
పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి..
X

దిశ, దౌల్తాబాద్ : పిడుగుపాటుకు గురై రెండు ఎడ్లు మృత్యువాత పడ్డ ఘటన దౌల్తాబాద్ మండలం ఇందూర్ ప్రియాల్ గ్రామంలో చోటు చేసుకుంది. గజ్వేల్ రాములు అనే రైతుకు రెండు ఎడ్లు ఉన్నాయి. బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షం రావడంతో రైతు ఆ ఎడ్లని ఊరి చివరన ఉన్న వేప చెట్టు కింద కట్టేశాడు.

అయితే ఆ చెట్టు పై పిడుగు పడటంతో రెండు ఎడ్లు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతుకు జీవనాధారమైన ఎడ్లు మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ఎడ్ల మృతితో లక్ష రూపాయలకు పైగా నష్టం వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రాములు కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed