కొడిమ్యాల‌లో విషాదం.. ఒంటిపై డీజిల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

by Shiva |
కొడిమ్యాల‌లో విషాదం.. ఒంటిపై డీజిల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

దిశ, కొడిమ్యాల: ఒంటిపై డీజిల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొడిమ్యాల‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన నాంపల్లి చంద్రయ్య అనే వ్యక్తి అంగడి బజార్ చౌరస్తాలో ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని అడ్డుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన జరిగిన స్థలానికి పోలీస్‌ స్టేషన్‌కు కూత‌వేటు దూరంలో ఉండడంతో చంద్రయ్యను పోలీసులు పీస్‌క తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే, అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి వివాదాల కారణంగానే చంద్రయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ఎస్సై సందీప్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed